మిడ్ మానేరుకు చేరుకున్న కాళేశ్వరం జలాలు Drone Visuals

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది

గోదావరి జలాలను శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌ మానేరుకు ఎత్తిపోస్తున్నారు

నంది మేడారంలోని పంప్‌హౌస్‌ ఒక మోటారును ఆన్‌ చేసి నీటిని తరలిస్తున్నారు

మేడిగడ్డ నుంచి ఎత్తి పోయకుండానే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయడం విశేషం

నంది పంప్‌హౌస్‌కు గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను వదిలారు

కాళేశ్వరం లోని నంది పంపుహౌస్ మోటర్లు కూడా ఆన్ చేసి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది

ప్రవాహాన్ని బట్టి రోజుకు 2 టీఎంసీల మేర నీటిని తరలిస్తున్నారు

ఎల్లంపల్లికిపై వస్తున్న నీటిని తరలించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఎత్తిపోస్తున్నారు