శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది.

దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి.

ఆమె నటించిన పలు సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

లాక్ డౌన్ లో ఆమె నటించిన సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి.

ఈ సినిమాలతో జాన్వీకి నటన పరంగా మంచి పేరొచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది.

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.