యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఎంత డేంజరస్ ప్లేయరో అందరికీ తెలిసిందే.

2018 ఐపీఎల్ వేలంలో అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

ఆ వేలం జరిగే సమయంలో తన తండ్రికి బీపీ వచ్చిందట.

ఈ విషయాన్ని ఇషాన్ కిషన్ స్వయంగా వెల్లడించాడు.

వేలం జరుగుతున్న సమయంలో తను స్నేహితులతో ఫుట్ బాల్ ఆడటానికి వెళ్లానని చెప్పాడు.

వేలం ముగిశాక తిరిగి ఇంటికి వెళ్లేసరికి తండ్రి అక్కడ కనిపించలేదట.

ఏం అయిందని తల్లిని అడిగితే బీపీ పెరగడంతో చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాడని వాళ్ల అమ్మ చెప్పిందట.

2018 వేలంలో ఇషాన్ రూ.6.2 కోట్లకు అమ్ముడుపోయాడు.

అయితే ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇషాన్‌కు భారీ ధర పలికింది.

ఏకంగా రూ.15.25 కోట్లకు ఇషాన్‌ను ముంబై కొనుగోలు చేసింది.
(All Images Credits: Ishan Kishan Insta)