ఆటల్లో సెంటిమెంట్లు సహజం! కొందరు వీటిని బలంగా నమ్ముతారు!

క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో యాదృచ్ఛికంగా ఇలాంటివి జరిగాయి!

ఈసారీ ఒక సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు.

2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను ఐర్లాండ్‌ ఓడించింది. అప్పుడు టీమ్‌ఇండియా టోర్నీ గెలిచింది.

ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌ గెలిచింది. అందుకే రోహిత్‌ సేన ట్రోఫీ ముద్దాడుతుందని ఫ్యాన్స్‌ నమ్మకం.

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన సూపర్‌ 12 పోరులో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 5 పరుగుల తేడాతో విజయం అందుకుంది.

ఐర్లాండ్‌ మొదట 157కు ఆలౌటైంది. ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ 14.3 ఓవర్లకు 105/5తో నిలిచింది.

వర్షం కురవడంతో డ/లూ విధానంలో 5 రన్స్‌ వెనకబడి ఉండటంతో ఇంగ్లాండ్‌ ఓటమి తప్పలేదు.

2011లో ఇంగ్లాండ్‌ మొదట 327 రన్స్‌ చేసింది. జొనాథన్ ట్రాట్‌ (92), ఇయాన్‌ బెల్‌ (81) రాణించారు.

ఈ టార్గెట్‌ను ఐర్లాండ్‌ 3 వికెట్లతో ఛేదించింది. కెవిన్‌ ఒబ్రెయిన్‌ 63 బంతుల్లోనే 113 కొట్టాడు. అలెక్స్‌ కుసక్‌ (47), జాన్‌ మూనీ (33) రాణించారు.