ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌కు రెడీ!

పసికూన నెదర్లాండ్స్‌తో సిడ్నీ క్రికెట్‌ మైదానంలో తలపడుతోంది.

గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.

నెదర్లాండ్స్‌ బంగ్లాదేశ్‌ చేతిలో ఓడి ఆఖర్లో ఉంది. NRR -0.450.

భారత్‌ ఒక మ్యాచ్‌ గెలిచి రెండో స్థానంలో ఉంది. NRR 0.050.

భారత్‌కు రోహిత్‌ , రాహుల్‌, సూర్య రాణించడం అవసరం. కోహ్లీ, పాండ్య ఫామ్‌లో ఉండటం ప్లస్‌పాయింట్‌.

అర్షదీప్‌ పవర్‌ప్లే, డెత్‌ ఓవర్లలో రాణించాడు. భువీ రన్స్‌ నియంత్రించాడు. పాండ్య మిడిల్‌లో వికెట్లు తీయడం ప్లస్‌.

అక్షర్‌ను పాక్‌ అటాక్‌ చేసింది. అతడు మెరుగవ్వాలి. అశ్విన్‌ ఫర్వాలేదు. షమి చక్కగా బౌలింగ్‌ చేశాడు.

నెదర్లాండ్స్‌లో బాస్‌ డి లీడ్‌ ఆల్‌రౌండ్‌ ఎబిలిటీస్‌తో రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌లో మాక్స్‌ ఓడౌడ్‌, బౌలింగ్‌లో ఫ్రెడ్‌ క్లాసెన్‌ తోడుగా ఉన్నారు.

సిడ్నీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. పేసర్లు, స్పిన్నర్లు కీలకం అవుతారు. మ్యాచ్‌ సాగే కొద్దీ పరుగులు వస్తాయి. ఛేదన జట్టుకు అడ్వాంటేజ్‌.