వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమ్‌ఇండియా విజయం సాధించింది.

ప్రత్యర్థి నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

7 వికెట్ల తేడాతో సిరీసులో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ (76; 44 బంతుల్లో 8x4,4x6) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

రిషభ్‌ పంత్‌ (33*; 26 3x4, 1x6) అజేయంగా నిలిచాడు.

అంతకు ముందు విండీస్‌లో కైల్‌ మేయర్స్‌ (73; 50 బంతుల్లో 8x4,4x6) విజృంభించాడు.

రోమన్‌ పావెల్‌ (23), నికోలస్‌ పూరన్‌ (22) ఫర్వాలేదనిపించారు.

సూర్య కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

తన పదర్శనతో సూర్య ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 2కు చేరాడు.

సూర్య 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకోవడంతో రెండో వికెట్‌కు 86 (59) రన్స్‌ భాగస్వామ్యం లభించింది.