వెస్టిండీస్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది.

సెయింట్‌ కీట్స్‌లో జరిగిన రెండో టీ20లో కరీబియన్లు తొలి విజయం అందుకున్నారు.

హిట్‌మ్యాన్‌ సేన నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్‌ను సునాయసంగా ఛేదించేశారు.

మరో 4 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేశారు.

బ్రాండన్‌ కింగ్‌ (68; 52 బంతుల్లో 8x4, 2x6), డేవాన్‌ థామస్‌ (31*; 19 బంతుల్లో 1x4, 2x6) అదరగొట్టారు.

అంతకు ముందు ఒబెడ్‌ మెకాయ్‌ (6/17) టీమ్‌ఇండియా పతనాన్ని శాసించాడు.

హార్దిక్‌ పాండ్య (31; 31 బంతుల్లో 1x4, 2x6), రవీంద్ర జడేజా (27; 30 బంతుల్లో 0x4, 1x6) టాప్‌ స్కోరర్లు.

కొన్ని కారణాలతో ఈ మ్యాచ్ 4 గంటలు ఆలస్యంగా మొదలైంది.

విండీస్ తరఫున టీ20ల్లో ఒబెడ్ మెకాయ్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

రోహిత్‌ శర్మ (0), సూర్యకుమార్‌ (11), జడ్డూ (27), యాష్‌, దినేశ్‌ కార్తీక్‌ (7), భువీ (1)ని మెకాయ్ ఔట్ చేశాడు.

సెయింట్ కీట్స్ లోనే ఆడుతుండటంతో మెకాయ్ పై అంచనాలు పెరిగాయి.