బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది.

జడేజా సూపర్ స్పెల్ కు భారత బ్యాటర్ల సూపర్ బ్యాటింగ్ తోడవడంతో టీమిండియా కంగూరూలను మట్టికరిపించింది.

ఆస్ట్రేలియాను మూడోరోజు లంచ్ లోపే ఆలౌట్ చేయడం దగ్గరే భారత్ విజయానికి పునాది పడింది.

అశ్విన్, జడేజాల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు.

ముఖ్యంగా జడ్డూ తన బౌలింగ్ తో కంగారూలకు కంగారు పుట్టించాడు.

మరోవైపు అశ్విన్ చక్కని సహకారం అందించాడు.

వీరి స్పిన్ మాయాజాలానికి 52 పరుగులకే ఆసీస్ చివరి 9 వికెట్లను కోల్పోయింది.

దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

దీంతో సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.