ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది.

వెస్టిండీస్‌ను 68 రన్స్‌ తేడాతో చిత్తు చేసింది.

191 టార్గెట్‌ ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టును 122/8 పరుగులకే పరిమితం చేసింది.

విండీస్ జట్టులో షమ్రా బ్రూక్స్‌ (20) టాప్‌ స్కోరర్‌.

భారత్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (64; 44 బంతుల్లో 7x4, 2x6) హాఫ్‌ సెంచరీ చేశాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌ (24; 16 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు.

దినేశ్‌ కార్తీక్‌ (41*; 19 బంతుల్లో 4x4, 2x6) ఫినిషింగ్‌ టచ్‌తో అలరించాడు.

అర్షదీప్‌, అశ్విన్‌, బిష్ణోయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు టీమ్‌ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు.

రోహిత్ శర్మ అత్యధిక పరుగులు, హాఫ్ సెంచరీల రికార్డు బద్దలు కొట్టాడు.