టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా నాలుగో మ్యాచ్‌కు రెడీ!

అడిలైడ్‌ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతోంది.

బంగ్లాపై టీమ్‌ఇండియాదే పైచేయి! మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.

గ్రూప్‌2లో భారత్‌ (NRR +0.844), బంగ్లా (-1.533) చెరో 3 మ్యాచులాడాయి. 4 పాయింట్లతో వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

ఈ మ్యాచులో గెలిచిన జట్టుకు సెమీస్‌ ఛాన్స్‌లు మెండుగా ఉంటాయి.

రోహిత్‌, కోహ్లీ, సూర్య ఫామ్‌లో ఉన్నారు. కేఎల్‌ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలి. పాండ్య ఓకే. డీకే హెల్త్‌ స్టేటస్‌ తెలియాలి.

భారత బౌలింగ్‌ బాగుంది. సఫారీల చేతిలో ఓటమికి ఫీల్డింగే కారణం. యూజీకి ఛాన్స్‌ రావొచ్చు.

తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌, హసన్‌ మహ్మద్‌ పేస్‌తో ప్రమాదమే. షకిబ్‌ స్పిన్‌తో జాగ్రత్తగా ఉండాలి.

అడిలైడ్‌ పిచ్‌లో పరుగుల వరద పారుతుంది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 170.

ఈ మ్యాచుకు వర్షం గండం పొంచి వుంది. వాన వస్తే సెమీస్‌ సమీకరణాలు ఇంట్రెస్టింగ్‌గా మారతాయి.