అహ్మదాబాద్ టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. ఐదోరోజు, సోమవారం 3/0తో ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియా మూడు సెషన్లూ ఆడేసింది.

78.1 ఓవర్లకు 175/2తో నిలిచింది. మార్నస్‌ లబుషేన్‌ (63; 213 బంతుల్లో 7x4), స్టీవ్‌ స్మిత్‌ (10; 59 బంతుల్లో 2x4) అజేయంగా నిలిచారు.

ఎలాగూ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ముందుగానే మాట్లాడుకొని కరచాలనం చేసుకున్నారు.

ఇందుకు అంపైర్లు అంగీకరించడంతో టీమ్‌ఇండియా ఈ సిరీసును 2-1 తేడాతో గెలిచింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

మరికొన్ని రోజుల్లోనే టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్లో తలపడనున్నాయి.

ఐదో రోజు, సోమవారం 3/0తో ఆట మొదలు పెట్టిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు.

ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (90; 163 బంతుల్లో 10x4, 2x6), మార్నస్‌ లబుషేన్‌ నిలకడగా ఆడారు. దాంతో 73/1తో ఆసీస్‌ లంచ్‌కు వెళ్లింది.

లబుషేన్, హెడ్ జోడీ రెండో వికెట్‌కు 139 (292 బంతుల్లో) భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.

లబుషేన్‌ 150 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకోగానే 158/2తో ఆసీస్‌ టీ బ్రేక్‌ తీసుకుంది.

ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి టీమ్‌ఇండియాను ఆలౌట్‌ చేద్దామన్న యోచన ఆసీస్‌లో కనిపించలేదు. రెండు జట్ల కెప్టెన్లు మాట్లాడుకొని మ్యాచ్‌ను ముగించారు.