ఆ నదిలో పారుతున్న బంగారం



మన దేశంలో ప్రత్యేకమైన నది ఉంది. అది బంగారు నది. ఈ నది తలో ఎంతో బంగారాన్ని దాచుకుంది.



ఎంతోమంది ప్రజలు ఆ నది నుండి బంగారాన్ని వెలికి తీసేందుకు రోజూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ నది పేరు స్వర్ణ రేఖ నది.



ఈ నది ఝార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తోంది. అయితే ఈ నదిలోకి బంగారం ఎలా చేరింది అనేది మాత్రం ఇప్పటికీ అంతుబట్టని రహస్యమే.



జార్ఖండ్‌లోని పిస్కా అనే గ్రామంలో ఈ నది పుట్టి... పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది.



ఇక్కడి ప్రజలు ఎంతోమంది జల్లెడలు పట్టుకొని ఆ నది ఒడ్డున బంగారు వేట సాగిస్తూనే ఉంటారు.



నది ఒడ్డున దొరికే ఇసుకను, నదిలోని ఇసుకను సేకరించి మెల్లగా జల్లిస్తూ ఉంటారు.



బంగారు రజనులాంటిది మిగులుతుంది. చాలా చిన్నచిన్న అణువుల రూపంలో ఇది ఉంటుంది.



ఆ బంగారాన్ని వారు అమ్ముకొని జీవిస్తూ ఉంటారు. శీతాకాలంలోనే ఇక్కడ ఎక్కువగా బంగారం లభిస్తుంది.