సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ గతేడాది విడుదల అయి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

కానీ ఆ సినిమాపై ఇప్పటికీ విమర్శలు ఆగడం లేదు.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ తాప్సీ కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు.

‘యానిమల్’లోని డార్క్‌నెస్‌ను ఆడియన్స్ సెలబ్రేట్ చేయడం తనకు నచ్చలేదన్నారు.

కానీ ‘యానిమల్’ సినిమా తన దగ్గరకు వస్తే అంగీకరించే దాన్నేమో అన్నారు.

ఒకవేళ ఆ స్క్రిప్టు తన దగ్గరకు వస్తే రణ్‌బీర్ కపూర్ స్థాయిలోనే ఎక్సైట్ అయ్యే దాన్నని అన్నారు.

ఎందుకంటే స్క్రిప్టు చదివినప్పుడు అందులో ఉన్న షాట్ ఎలా తీస్తాడో మనకు తెలియదని తెలిపారు.

అది తనకు స్క్రిప్టులో కనిపించదన్నారు.

సినిమా ఎలా వస్తుందనేది స్క్రిప్టు దశలో ఎవరూ చెప్పలేరన్నారు.

అయితే ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సీక్వెల్ కూడా రెడీ అవుతుంది.