హైదరాబాద్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ 2008లో ఏర్పడింది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది.
తొలిసారి 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి TDP అభ్యర్థి మహమ్మద్ సలీమ్పై విజయం సాధించారు.
2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ AIMIM అభ్యర్థి నవీన్ యాదవ్పై విజయం సాధించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ TRSలో చేరి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్దన్ రెడ్డిపై విజయం సాధించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజ్హరుద్దీన్ను ఓడించి మాగంటి గోపీనాథ్ మూడోసారి విజయం సాధించారు.
2009లో కాంగ్రెస్ ఆధిపత్యం ఉంటే, 2014లో TDP విజయం సాధించి, 2018 & 2023లో కారు జోరు కొనసాగింది.
జూబ్లీహిల్స్లో హ్యాట్రిక్ కొట్టి మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
2025 జూన్ 8న మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ సీటు ఖాళీ అయింది.
3.90 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 11 జరగనుంది. కౌంటింగ్ నవంబర్ 14.
BRS అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించారు.