మసాలా నెయ్యి గురించి తెలుసా?

మామూలు నెయ్యి అందరికీ తెలుసు, కానీ మసాలా నెయ్యి చాలా స్పెషల్.

ఒక గిన్నెలో కారం, కుంకుమపువ్వు రేఖలు, సోంపు పొడి, యాలకుల పొడి, పసుపు, నెయ్యి వేసి బాగా కలపాలి. అదే మసాలా నెయ్యి.

ఈ మసాలా నెయ్యిని చపాతీలపై రుద్దుకొని తింటే ఆ రుచే వేరు. అలాగే గోరువెచ్చని పాలలో దీన్ని కలుపుకొని తాగినా ఎంతో మంచిది.

ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్లు A, D, E, K పుష్కలంగా లభిస్తాయి.

ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో వాడిన మసాలా దినుసులు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి.

కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. కీళ్ళకు లూబ్రికేషన్ అందిస్తుంది.

మసాలా నెయ్యిలో గుండెకు అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది.

ఆహారంలో మసాలా నెయ్యిని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది.