మరణానికి చేరువలో ఉన్నవారికి పూర్వీకుల నీడలు కనిపిస్తాయా!



గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు, అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడటం ప్రారంభిస్తాడు



పితృదేవ‌త‌లు ఆ వ్యక్తిని పిలుస్తున్న‌ట్టు అతనికి అనిపిస్తుంది. మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి అలాంటి సంకేతాల‌ను పొందుతాడని నమ్ముతారు.



గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది. కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడాన్ని చూస్తారు, మరికొందరు ఆ తలుపు నుంచి మంటలు రావడం చూస్తారు



తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఈ అనుభవం ఎదురైతే, ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం చేసుకోవాలి. అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి.



జీవితం చివరి క్షణాలలో, ఒక వ్యక్తి త‌నకు ప‌రిచ‌యం లేని క్రూరంగా ఉన్న వ్య‌క్తుల‌ను చూస్తాడు. నిజానికి వారు యమదూతలు, ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు.



ఒక వ్యక్తి తన చుట్టూ యమ దూతల ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు, అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం



ఒక వ్యక్తికి చివ‌రి క్ష‌ణాలు స‌మీపించిన‌ప్పుడు.. అతను నీటిలో, అద్దంలో, నెయ్యి, నూనెలో తన ప్రతిబింబాన్ని చూడ‌లేడు. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి.



చివరి క్షణం వచ్చినప్పుడు, అతను తన మనస్సులో దాచుకున్న‌ కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు. ఓపికగా వినడ‌మే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి.



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

మందార పూలతో ఇలా చేస్తే, మీ సమస్యలన్నీ మాయం

View next story