మరణం సమీపించే ముందు సంకేతాలివే - శివపురాణం ప్రకారం



శివ పురాణం ఒక వ్యక్తి మరణానికి ముందు అతనికి కనిపించే కొన్ని సంకేతాలను ప్రస్తావిస్తుంది. మీకు అలాంటి సంకేతాలు క‌నిపిస్తే మరణం ఆస‌న్న‌మైంద‌ని అర్థం



శివ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి చనిపోబోయే కొన్ని నెలల ముందు శరీరం అకస్మాత్తుగా నీలం రంగులోకి మారుతుంది. లేదా శరీరంపై ఎర్రటి గుర్తు కనిపిస్తుంది. ఇలాంటి సంకేతాలు క‌నిపించిన త‌ర్వాత ఆ వ్యక్తి కేవలం 6 నెలలు మాత్రమే జీవిస్తాడు.



ఒక వ్యక్తి శరీరంలోని కొన్ని భాగాలు పనిచేయడం మానేస్తే, అలాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంటుందని శివపురాణంలో వివ‌రించారు.



ఒక వ్యక్తి నోరు, చెవులు, కళ్లు, నాలుక సరిగా పని చేయకపోతే, ఆ వ్యక్తి మరణానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉందని అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు 6 నెలలలోపు చనిపోవచ్చు.



ఒక వ్యక్తి ఎడమ చేయి మెలితిప్పినట్లు లేదా నోటి లోపల ఉన్న అంగుటిపై భాగం పొడిబారడం ప్రారంభిస్తే, శివ పురాణం ప్రకారం దాదాపు ఒక నెలలో చనిపోతాడు.



మరణ సమయం సమీపిస్తున్న వ్యక్తి నీటిలో, నూనె, నెయ్యి లేదా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. శివ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి తన నీడను చూడలేనప్పుడు, మరణం ఆసన్నమైంద‌ని తెలుసుకోవాలి.



ఒక వ్యక్తి మరణించే సమయం ఆసన్నమైతే ఆ వ్యక్తికి చంద్రుడిని, నక్షత్రాలను సరిగా చూడలేడ‌ని శివపురాణంలో వివ‌రించారు. అలాంటి వ్యక్తులు కేవలం ఒక నెలలోనే మ‌ర‌ణిస్తారు.



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: వీళ్లపై నోరు పారేసుకోవడం మహాపాపం

View next story