శోభిత ధూళిపాళ‌.. త్వ‌ర‌లో అక్కినేని వారి కోడ‌లు కాబోతున్నారు.

ఆగస్టు 8న నాగచైత‌న్య‌, శోభిత నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది.

తెనాలిలో పుట్టి, విశాఖ‌లో పెరిగిన తెలుగ‌మ్మాయి శోభిత‌.

మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. 2013లో 'ఫెమినా మిస్ ఇండియా ఎర్ట్' టైటిల్ విన్న‌ర్.

శోభిత తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా న‌టించారు.

అనురాగ్ క‌శ్య‌ప్ డైర‌క్ష‌న్ లో 'ర‌మ‌ణ్ రాఘ‌వ్ 2.0' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి మూడు సినిమాల్లో న‌టించారు.

తెలుగులో 'గూఢాచారి', 'మేజ‌ర్' సినిమాల్లో న‌టించారు.

మ‌ల‌యాళంలో 'కురూప్', 'మూథ‌న్' సినిమాలు చేశారు.

మ‌ణిర‌త్నం డైర‌క్ష‌న్ లో వ‌చ్చిన 'పొన్నియ‌న్ సెల్వ‌న్' సిరీస్ లో కూడా న‌టించారు శోభిత‌.

Image Source: Image Credits: Sobhita Instagram, Facebook

వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్ లలో క‌నిపించారు ఆమె.