'కోర్టు', 'సారంగపాణి జాతకం' చిత్రాల తర్వాత ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా 'మిత్రమండలి'.
ప్రియదర్శి హీరో కావడంతో పాటు 'బన్నీ' వాసు విడుదల చేయడం వల్ల 'మిత్ర మండలి'కి క్రేజ్ ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాల్లో 'మిత్ర మండలి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 3.50 కోట్లు జరిగింది.
కర్ణాటకతో పాటు రెస్టాఫ్ ఇండియా బిజినెస్ జస్ట్ రూ. 30 లక్షలు మాత్రమే.
'మిత్ర మండలి' ఓవర్సీస్ బిజినెస్ బాగా జరిగింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ కోటి వచ్చాయి.
'మిత్రమండలి' టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 4.80 కోట్లు అని ట్రేడ్ వర్గాల టాక్.
'మిత్ర మండలి' క్లీన్ హిట్ అవ్వాలి అంటే రూ. 5.50 కోట్ల షేర్ అందుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో 350కు పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. వరల్డ్ వైడ్ 550 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.