Image Source: Manushi Chhillar Instagram

ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకొని, నటిగా మారిన అందాల భామ మానుషి చిల్లర్‌.

2022లో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ చిత్రంతో తెరంగేట్రం చేసింది.

‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ మూవీలో విక్కీ కౌశల్‌ కు జోడీగా నటించింది.

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాతో మానుషి టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె రాడార్‌ ఆఫీసర్‌గా నటించింది.

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మూవీ ఈరోజు (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హరియాణాకు చెందిన ఈ బ్యూటీ.. వైద్య విద్యను అభ్యసించింది.

2017లో 'ఫెమినా మిస్‌ ఇండియా', 'మిస్‌ వరల్డ్‌' కిరీటాలు సాధించింది.

మానుషి చిల్లర్‌.. ప్రపంచ సుందరిగా నిలిచిన 6వ భారతీయురాలు.

ప్రస్తుతం ‘బడే మియా ఛోటే మియా’ అనే హిందీ సినిమా చేస్తోంది.

Image Source: Manushi Chhillar Instagram

జాన్ అబ్రహాం నటించే 'టెహ్రాన్' అనే చిత్రంలోనూ భాగం కానుంది.