సంగీత్‌లో ‘అంబానీ’ రెట్రో సాంగ్ - ముఖేష్ మనవళ్లను చూశారా?

భారత వాణిజ్య దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి మరికొద్ది రోజుల్లోనే.

ఈ సందర్భంగా ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్, రాధికాల సంగీత్ ఫంక్షన్ ఘనంగా జరిగింది.

రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌‌ల వివాహం జరగనుంది. దీంతో ప్రీవెడ్డింగ్ వేడుకలు చేస్తున్నారు.

జులై 5న జరిగిన సంగీత్ వేడుకలో అంబానీ ఫ్యామీలీ అంతా వేదికపై సందడి చేశారు.

ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా కలిసి ఓ డ్యూయెట్ కూడా పాడుకున్నారు.

ఆ పాటలో అంబానీ దంపతుల మనవళ్లు కూడా ఉన్నారు.

కారులో షికారు చేస్తూ.. రెట్రో స్టైల్‌లో ఈ పాటను చిత్రీకరించి, సంగీత్‌లో ప్రదర్శించారు.

ఆ తర్వాత అంబానీ ఫ్యామీలీ అంతా కలిసి వేదికపై ‘ఓం శాంతి ఓం’ పాటకు స్టెప్పులేశారు.

సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్