ఒంట్లో నీరు తగ్గితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది



దాహం వేసినా, వేయకపోయినా ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా నీళ్లు తాగాల్సిందే.



కానీ చాలామంది దాహం వేస్తే మాత్రమే నీళ్లు తాగుతారు. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. త్వరగా డిహైడ్రేషన్ బారిన పడతారు.



శరీరంలో నీళ్లు తగ్గితే ప్రధాన అవయవాలైన కాలేయం, కండరాలు, కీళ్లు వంటివి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.



అన్నిటికంటే ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది.



ఎప్పుడైతే శరీరంలో నీరు తగ్గుతుందో కొలెస్ట్రాల్ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరుగుతాయి.



నీటి శాతం తగ్గిపోతే కాలేయం రక్తంలోకి ఎక్కువగా కొలెస్ట్రాల్ ని విడుదల చేస్తుందని చెబుతున్నారు పరిశోధనకర్తలు.



తగినంత నీరు తాగితే మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చనే విషయాన్ని మాత్రం చెబుతున్నారు.



నీరు ఎక్కువగా తాగితే... కొలెస్ట్రాల్ తక్కువగా రక్తంలోకి విడుదలవుతుంది. గుండె పోటు వంటివి వచ్చే పరిస్థితులు తగ్గుతాయి.