సీరియస్‌గా సాగే టీవీ డిబేట్‌లలో ఒక్కోసారి జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. కొన్నిసార్లు లైవ్​ డిబేట్​ల​లో మాటమాట పెరిగి సభ్యులు ఒకరిపై మరొకరు దాడిచేసుకొవడం, తిట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ కూడా అవుతాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


ఏముంది?






బంగాల్‌కు చెందిన ఒక టీవీ ఛానెల్​ డిబేట్​లో యాంకర్​, ఐదుగురు సభ్యులు పాల్గొన్నారు. చర్చలో అందరూ తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో డిబెట్​లో పాల్గొన్న ఒక మహిళ తన వంతు కోసం వేచిచూస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ మిగతా సభ్యులు మాత్రం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు.


దీంతో ఆ మహిళ లైవ్​లోనే స్టెప్పులేయడం మొదలెట్టింది. దీంతో సభ్యులంతా అవాక్యయ్యారు. ఆ తర్వాత సదరు మహిళ గట్టిగా అరుస్తు వెరైటీగా స్పందించింది.


పాతదే కానీ..


ఈ ఫన్నీ డిబేట్​ గతంలోనే జరిగింది. ఇలా డ్యాన్స్ చేసిన మహిళ రోష్నిఆలీ. ఆమె ఓ పర్యావరణ వేత్త. అయితే తాజాగా ఈ వీడియోను ఎలిజబెత్​ అనే ట్విటర్​ యూజర్​ తన ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు.





దీంతో మరోసారి ఇది వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా ఉందంటూ వైరల్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. 


Also Read: UP Election 2022: తండ్రి ములాయం సింగ్ కంచుకోట నుంచే అఖిలేశ్ యాదవ్ పోటీ


Also Read: Pramod Gupta Joins BJP: యూపీలో భాజపా దెబ్బకు దెబ్బ.. నిన్న కోడలు, నేడు తోడల్లుడు.. ఎస్పీకి వరుస షాక్‌లు!


Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి