Telangana News: వికారాబాద్ జిల్లాలో ఇంద్ర సినిమాలో తరహా మోసం జరిగింది. పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొంగ సాధువులు భోజనం చేసి యజమానికి టోకరా వేశారు. నీవు సమస్యలో ఉన్నావని మంచి జరగాలంటే రాగి చెంబులో చేతికి ఉన్న బంగారం  వేయని చెప్పగా యజమాని అలాగే చేశాడు. యజమానిని ఇంట్లోకి పంపించి, వచ్చేసరికి రాగి చెంబుకు తెల్లబట్ట చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవద్దని తెలపడంతో అనుమానం వచ్చి యజమాని చెంబు తెరచి చూడగా అందులో రాయి ఉంది. మోసపోయానని గమనించి అరవడంతో చుట్టుప్రక్కల వారు దొంగ సాధువులను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.


ఇటువంటి దొంగ బాబాలతో అప్రమత్తంగా ఉండాలని.. వారు జాగ్రత్తగా జనాల్ని నమ్మించి మోసం చేస్తారని పోలీసులు తెలిపారు. అమాయక ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తారని అన్నారు. ఎవరైనా సరే కొత్తవారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాత్రి అయిన పగలు అయినా కొత్త వేషధారలతో వస్తే వెంటనే పట్టుకొని పోలీసులకు అప్పజెప్పాలని సూచించారు. చాలా మంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి బొలెరో కార్లలో వచ్చి అక్కడక్కడ తిరుగుతున్నారని స్థానికులు తెలిపారు.