Family Suicide in Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో (Gangaputra Colony) దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తెకు ఉరి వేసి వారు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాలనీలో నివాసం ఉండే సురేశ్ బాబు, చిత్రలేఖ దంపతులు తమ కుమార్తె తేజస్వికి ఉరి వేసి అనంతరం వారూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఏపీ కర్నూలు జిల్లా లక్ష్మీపురం (Laxmipuram) వాసులుగా గుర్తించారు. వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కల్యాణపురం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి సోడెం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, 20 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, వీరు మణుగూరులో రాహుల్ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


Also Read: Attack on MLA PA: టీడీపీ ఎమ్మెల్యే పీఏపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి - రోడ్డుపై బైఠాయించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి