జోగులాంబ గద్వాల జిల్లాలో ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. అలంపూర్​ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించనున్న వంద పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమిపూజ చేశారు. గద్వాల్ పర్యటనలో భాగంగా మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్.. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు.


Also Read: Ganesh Immersion: గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై సుప్రీం కోర్టుకు తెలంగాణ సర్కార్


Also Read: Gold-Silver Price: దేశంలో స్థిరంగా బంగారం ధరలు , తగ్గిన వెండి ... తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా...


కేటీఆర్ గద్వాల్ పర్యటన కారణంగా కొన్ని రోజులు విపక్షాలు నిరసన గళం ఎత్తాయి. దీంతో బందోబస్తులో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్​ కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేసి ఐజ పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు. అలంపూర్​లోని కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.  ముందస్తు అరెస్టులు సరైనవి కావని.. కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?


Also Read: Nellore News: రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు.. కానీ పానీపూరి ఫోన్ కాల్ పట్టించేసింది


2014 నుంచి పలుమార్లు గద్వాల నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్, కేసీఆర్..  హామీలను నెరవేర్చలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తుమిళ్ల ఎత్తిపోతల, జూరాల ఆయకట్టు విస్తరణ, గుర్రంగడ్డ వంతెన, గట్టు ఎత్తిపోతల హామీలు నీటమూటలుగానే మిగిలిపోయాయని చెబుతున్నాయి. గద్వాల్ వైద్యకళాశాలను ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి డిమాండ్ చేశారు. టెక్స్‌టైల్‌ పార్కుతోపాటు పలు శంకుస్థాపనలు చేసిన పనులను పూర్తి చేశాకే.. కేటీఆర్ జిల్లాకు రావాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అన్నారు.


Also Read: TS Congress : టీ కాంగ్రెస్‌లో మళ్లీ జూలు విదిలిస్తున్న గ్రూపులు ! ఐక్యత ఎండ మావేనా ?


Also Read: Tollywood: టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ... చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ


Also Read: Weather Report: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఇవాళ, రేపు వర్షాలు..