TS High Court : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్​ ను నియమిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది.  ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్ చంద్రను శర్మ దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ​ను కొలీజియం సిఫార్సు మేరకు సీజేగా నియమించింది. 


గువాహటి నుంచి 


అసోం గువాహటిలో 1964 ఆగస్టు 2న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ జన్మించారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తండ్రి సుచేంద్రనాథ్‌ ఏజీగా పనిచేశారు. గువాహటిలోని డాన్‌బాస్కో పాఠశాలలో జస్టిస్‌ భూయాన్‌ చదువుకున్నారు. గువాహటిలోని ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి ఎల్‌ఎల్ఎం పూర్తి చేశారు. అనంతరం గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2010లో గువాహటి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పదోన్నతి పొందారు. 2011న అసోం అదనపు ఏజీగా నియమితులైన ఆయన... 2011న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019న బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బదిలీ అయ్యారు. ఆ తర్వాత 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ట్రాన్స్ ఫర్ అయ్యారు.