AP Telangana Breaking News: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు.. ఏపీ నుంచి ఇద్దరికి పురస్కారం

Advertisement

లోకల్‌ టు గ్లోబల్‌ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే చూసేందుకు ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి

ABP Desam Last Updated: 18 Aug 2021 04:53 PM
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఈ పురస్కారాలకు దేశవ్యాప్తంగా 44 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు.


విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం హైస్కూల్‌‌కు చెందిన  ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్..  చిత్తూరు జిల్లాలోని ఎం పాయిపల్లి ఐరాల హైస్కూల్‌ టీచర్ మునిరెడ్డిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి.

Continues below advertisement
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనంపైకి డంపర్ ఎక్కడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులను సింగరేణి కార్మికులు సాగర్, పాషా, ప్రైవేట్ వాహనం డ్రైవర్ వెంకన్నగా గుర్తించారు. జిల్లాలోని మణుగూరు ఓసి-2లో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

Background

జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోరుట్ల పట్టణంలోని ఆనంద్‌ షాపింగ్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు రెండు గంటలుగా మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. షాపింగ్‌ మాల్‌ మొత్తం నాలుగు అంతస్తులు ఉండగా.. మొత్తం భవనమంతా వ్యాపించాయి. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగినట్లుగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం సరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తునే నష్టం జరిగినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు.


Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలివే..


Also Read: Weather Updates: ఈ జిల్లాలకు అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.