Work From home for IT Employees in Hyderabad: సోమవారం నాడు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇవ్వాలని పోలీసులు ఐటీ కంపెనీలకు సూచించారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దాంతో ఇదివరకే హైదరాబాద్ జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, వర్షాలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు నగరంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.