Telangana High Court: టాలీవుడ్‌లో నటీనటుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి.  ఆయన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య నిశ్చితార్థం నుండి పీక్స్ చేరిన ఈ గొడవ  ప్రస్తుతం అన్ని వర్గాల వారు టార్గెట్ చేసే విధంగా మారింది.  కొద్ది రోజులుగా మీడియా నుంచి కూడా వేణు స్వామిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. అంతేకాదు వేణు స్వామికి సపోర్ట్ గా ఆయన సతీమణి వీణా శ్రీవాణి కూడా వంత పాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా న్యూస్ ఛానళ్లతోనూ వివాదం పెంచుకున్నారు. కాగా, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మీద తప్పుడు జాతకాలు చెప్పారని, వారి ప్రైవసీపై  వేణు స్వామి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆయన పై ఫిల్మ్ జర్నలిస్టు సంఘం మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 



హైకోర్టులో పిటిషన్ 
దీనిపై వేణుస్వామిని వివరణ కోరుతూ  ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 28(బుధవారం)న పిటిషన్ ను విచారించిన హైకోర్టు మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్, మహిళా కమీషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.



వాళ్ళకి లేని సమస్య మీకెందుకు 
  మహిళా కమిషన్ నోటీసులు చెల్లవని హై కోర్టు తీర్పు ఇచ్చింది. అసలు నాగచైతన్య (Naga Chaitanya) – శోభితా ధూళిపాలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిర్యాదుదారులపై ,మహిళా కమీషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నెట్టింట్లో రకరకాలుగా చర్చ నడుస్తుంది. దాదాపుగా ఒకరి వ్యక్తిగత విషయాలపై చర్చకు తెర తీసిన  వేణుస్వామిదే తప్పంటూ నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇష్యూ ఇంతటితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది చూడాలి.  


ఎంగేజ్మెంట్ రోజు నుంచే మొదలు
నాగచైతన్య- శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న రోజునే వేణుస్వామి రంగంలోకి దిగి మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారంటూ జ్యోసం  చెప్పారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేసి వివాదానికి బీజం వేశారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై తెలుగు ఫిలీం జర్నలిస్ట్ అసొసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు.