Bandi Sanjay About KCR: రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలకు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలే కారణమని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా..? ఇంకెంత మంది రక్తం చిందిస్తే మీ కళ్ళు చల్లబడతాయి కేసీఆర్ అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.  సీఎం కేసీఆర్ మానవత్వం లేని మూర్ఖుడు అని, ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజును కిరాతకంగా చంపేసినా స్పందించక పోవడం దారుణమన్నారు.


బాధిత కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం తోపాటు 8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశించినా ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు. సీఎం కేసీఆర్ తాగి ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు తప్ప పట్టించుకోవడం లేదు. దళిత, సోకాల్డ్ సంఘాలు ఏమైపోయినాయ్? నాగరాజు ఇంటి, కుటుంబ సభ్యుల శోకం, ఆర్ధిక దుస్థితి మీకు కన్పించడం లేదా? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. నాగరాజును నగరంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ముస్లింలు నరికి చంపితే కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదు? కనీస ఆ కుటుంబాన్ని కెసిఆర్ ఎందుకు పరామర్శించ లేదన్నారు. ముస్లిం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అబ్బయిలను చంపేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 


కేసీఆర్ పాతబస్తీ పోవాలంటే పర్మిషన్..
‘ఎంఐఎం నేతల పేరు వింటే సీఎం కేసీఆర్ గజగజ వణికిపోతున్నాడు. పాతబస్తీ పోవాలంటే కేసీఆర్ కూడా అసదుద్దీన్ ఒవైసీ అనుమతి తీసుకోవాల్సిందే. అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడా? పోలీసులకు కూడా ఆయన తెలియదని కానిస్టేబుళ్లు చెబుతున్నారు. నాగరాజు ను హత్య చేసిన నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదు. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోరా? . కేసీఆర్ వ్యవహార శైలిపై దళితులు అందరూ ఆలోచించాలి. దళిత బిడ్డ నాగరాజు హత్యను పరువు హత్య గానో, రెండు కుటుంబాల మధ్య గొడవగానో చిత్రీకరించడం దారుణమని’ బండి సంజయ్ అన్నారు.


హత్య కాదు.. ఉగ్రవాదుల ప్రేరేపిత చర్య
లవ్ జిహాదీ పేరిట ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, లోబర్చి, అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే సోకాల్డ్ ప్రోగ్రెసివ్ సంఘాల నోళ్లెందుకు ప్రశ్నించడం లేదు. నాగరాజుది ముమ్మాటికి వ్యక్తిగత హత్యకాదని, ఉగ్రవాదుల ప్రేరేపిత చర్య అన్నారు. మిర్యాలగూడలో ఇదే ప్రేమ వివాహం చేసుకున్న దళితుడిని హత్య చేస్తే గాయిగాయి చేసిన ఈ సంఘాలు దళిత బిడ్డ నాగరాజు విషయంలో నోరెందుకు పడిపోయిందని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం గుంటూరులో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడిని  గురజాల వరకు ఛేజ్ చేసి, నరికి చంపారు.
ఇలాంటి దుశ్చర్యలతో మొత్తం హిందూ సమాజాన్ని భయపెట్టి, తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ చేసిన కుట్ర ఇది అన్నారు.


తమ కొడుకును హత్య చేసిన నిందితులను ఉరి శిక్ష వేయాలని నాగరాజు కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నకు సమదానమేది?. నాగరాజు హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను ఇంకా అరెస్ట్ చేయక పోవడం సిగ్గుచేటు. వారికి ఎవరితో సంబంధాలున్నాయి, టీఆరెస్ పాత్ర ఏమిటో చెప్పాలి. అందరూ చూస్తుండగా నరికి చంపుతుంటే కనీసం కాపాడే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగే సమయంలో మొబైల్ లో చిత్రీకరించడం కంటే ముందు ప్రాణాలు కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాగరాజు హత్య కేసులో నిందితులను శిక్షించడంతోపాటు దీని వెనక ఉన్న కుట్రను చేధించేదాకా బీజేపీ ఆందోళనలు కొనసాగిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.