Ponnam Prabhakar and Vijaya Lakshmi: హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో ప్రోటోకాల్‌ వివాదం దుమారం రేపింది. అధికారుల తీరుపై అలిగిన మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మి గుడి బయటే ఉండిపోయరు. 


బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ్ చాలా వైభవంగా జరుగుతోంది. ఈ ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఉదయాన్నే వచ్చారు. ఆ సమయంలో అధికారులు తమ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌పై మంత్రి సీరియ్ అయ్యారు. కనీసం వీఐపీలు వస్తున్న టైంలో ప్రోటోకాల్ పాటించాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆ టైంలో సెక్యూరిటీ ఎందుకు లేదని నిలదీశారు. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగిన మంత్రి, జీహెచ్‌ఎంసీ మేయర్ గుడి బయటే ఉండిపోయారు. తర్వాత అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత గుడిలోపలికి వెళ్లి దర్శించుకున్నారు.