రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్టార్ హోటల్ పబ్ లో యువతిపై దాడి జరిగింది. ఈ మేరకు ఇరు వర్గాల నుంచి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ యువతి యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ఫిర్యాదులో నమోదైన వివరాల ప్రకారం.. న్యూట్రిషనిస్ట్, డైటిషన్ అయిన యువతిపై పబ్ లో బడా బాబుల పిల్లలు అసభ్యంగా ప్రవర్తించారు. రూఫ్ టాప్ పబ్ లాంజ్ లో ఈ ఘటన జరిగింది.


బాధితురాలు ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్ళింది. ఆదివారం తెల్లవారుజామున పబ్ లోనే బాధితురాలిపై 8 మంది యువకులు అసభ్య ప్రవర్తన చేశారని ఆమె ఆరోపించింది. ఆపేందుకు ప్రయత్నించిన స్నేహితురాళ్ళపై యువకులు బాటిల్స్ తో విచక్షణ రహితంగా దాడి చేశారు. పబ్ లో ఉన్న సమయంలో బాధితురాలి దగ్గరికి వచ్చి నిందితులు ఆమె ఫోన్ నంబర్  అడిగారు. బాధితురాలు ఇవ్వను అని చెప్పడంతో అబ్రార్, సాధ్ అనే యువకులు ఆమెను పక్కకి తీసుకెళ్లారు. పదే పదే తమతో 8 మంది యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది.


రేప్ చేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఫిర్యాలో పేర్కొంది. అడ్డు వచ్చిన స్నేహితురాళ్లపై  మద్యం సీసాలతో దాడి చేశారని వెల్లడించింది. అడ్డుకోబోయిన పబ్ నిర్వహకులపైనా యువకులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో వివరించింది. 


అక్కడి నుంచి బాధితురాలు పబ్ నుండి నేరుగా హాస్పిటల్ కి వెళ్ళింది. హాస్పిటల్ నుండి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు బాధితురాలు వెళ్లింది. రాయదుర్గం పోలీసులు ఫిర్యాదు చేసింది. యువకులు తమపై దాడి చేసిన ఘటనకు సంబంధించి పబ్ సీసీటీవీ ఫుటేజీని బయట పెట్టాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.