Enadu Group Chairman: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదో తేదీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. 


వయసురీత్య రామోజీరావుకు స్టంట్ వేయడంతో ఇతర వ్యాధులు ఇబ్బంది పెట్టాయి. అందుకే ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి రామోజీరావు ఆరోగ్యం నిలకడగా ఉందని కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.