తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సు ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్‌ సమావేశం అయ్యారు. కొత్త సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు, అన్ని శాఖల ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, పోడు భూములకు సంబంధించి పట్టాల పంపిణీ, వచ్చే వర్షాకాలంలో హరితహారం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ విషయాల్లో ప్రభుత్వం తరఫున ఎలా ముందుకకు వెళ్లాలనే అంశంపైన కూడా కేసీఆర్‌ సూచనలు చేయనున్నారు.