ABP Southern Rising Summit In Hyderabad | హైదరాబాద్: అతివృష్టి, అనావృష్టి రెండూ దేశానికి ప్రమాదమేనని బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత అన్నారు. ఫెడరలిజం వల్ల అన్ని రకాల పండుగలు, మతాలు, రాష్ట్రాలు ఒక గొడుకు కిందకు వస్తాయన్నారు. ఏబీపీ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రాజకీయాల్లో మహిళల పాత్రపై డీఎంకే ఎంపీ డాక్టర్ కనిమొళి సోము, బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్, టీడీపీ నాయకురాలు జ్యోష్న తిరునగరి పాల్గొని ప్రసంగించారు. 


మదర్సాలపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు
నా నియోజకవర్గంలోని ఓల్డ్ సిటీలో మదర్సాలు ఉన్నాయి. అందులో పిల్లలకు ఆహారం, దుస్తులు ఆర్టికల్ 32 ప్రకారం లభిస్తున్నాయి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. అయితే వాటిని కేవలం మత సంబంధిత కార్యక్రమాలు, బోధనలకు ఎందుకు వాడుతున్నారు. వారికి నిధులు ఎలా లభిస్తున్నాయని’ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చూడరనీ, తెలంగాణ హోం మంత్రి దీన్ని పట్టించుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.


ఫెడరలిజానికి భారత క్రికెట్ టీం ఉదాహరణ


 మన సంప్రదాయాన్ని రిస్టోర్ చేయడానికి, రక్షించడానికి సామ్యవాదం దోహదం చేయాలన్నారు. కానీ ఏం జరుగుతుంది. మరోవైపు అంతర్జాతీయంగా భారత్‌ను రిప్రజెంట్ చేసే విషయాల్లో రాష్ట్రాలోని స్థానిక కల్చర్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని గుర్తుచేశారు.. కేవలం అక్కడ టాలెంట్‌, పని తీరునే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. అందుకు భారత క్రికెట్ టీం ఉదాహరణగా చెప్పారు. జాతీయ క్రికెట్ జట్టులో అక్కడ బెంగాలీగానో, తెలుగు వ్యక్తి అనో, తమిళ ఆటగాడిగానో ఉండరు. వారంత భారత క్రికెటర్లు, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని మాధవీలత అన్నారు. 


ఆలయాలు ఫెడరలిజంలో ఉన్నాయి. మీ రాష్ట్రంలోని సంస్కృతిని, ధర్మాన్ని, ఆలయాలను కాపాడాలని చెబుతున్నాం. దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా అంతా ఏకతాటిపైకి రావాలని బీజేపీ భావిస్తోంది. నీటి పంపకాల విషయంలోనూ వివాదాలు ఉన్నాయి. దేశం విషయానికొస్తే అంతా కలిసి ఒక్కటేనని నిరూపించాలని, ఇదే ఫెడరలిజాన్ని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఒక రాష్ట్రంలో ఓ పండుగ ఉంటే, మరో రాష్ట్రంలో ఇంకో పండుగనో, మరో పేరుతోనే నిర్వహించుకుంటారని.. ఇందులో ఎవరకీ సమస్య లేదన్నారు.  
Also Read: Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 



 
అతివృష్టి విషయానికి వస్తే దేవాలయాల విషయంలో  బీజేపీ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అని చెబుతూ పాటించాలని చూస్తోంది ఫెడరల్ వ్యవస్థలో భాగంగా. ఆయా ప్రాంతీయ సంస్కృతులను గౌరవిస్తూనే దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని బీజేపీ చెబుతోంది. మేం తెలంగాణలో మేం బతుకమ్మ వేడుకల్లో, తీజ్‌ ఫెస్టివల్స్‌లో, రాజస్థాన్‌లో జరిగే శాంబాబా వేడుకల్లోనూ పాల్గొంటాంమని మాధవీలత తెలిపారు.


ABP Southern Rising Summit 2024 Live Updates కోసం క్లిక్ చేయండి 


Also Read: ABP Southern Rising Summit: ఒకే దేశం, ఒకే ఎన్నికలు అవసరం లేదు - భిన్నత్వంలో ఏకత్వం చాలు: డీఎంకే ఎంపీ కనిమొళి సోము