Deputy CM Pawan Kalyan And Telangana CM Revanth Reddy: ఈ ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ మధ్య కాలంలో భారీగా వరదలు వచ్చి ఖమ్మం మొత్తాన్ని నీట ముంచేశాయి. దీంతో బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ చెక్‌ను స్వయంగా  సీఎం రేవంత్‌ను కలిసి పవన్ కల్యాణ్ అందజేశారు.