Premium Smartphones Diwali Offer 2024: దేశంలో దీపావళి పండుగ మరికొద్ది రోజుల్లో జరగనుంది. దీంతో ప్రజలు పండుగ రోజున స్మార్ట్‌ఫోన్‌ల నుంచి అనేక గాడ్జెట్‌లను కొనుగోలు చేస్తారు. పండగ ఆఫర్లలో వారికి మంచి ధర తగ్గింపు కూడా లభిస్తుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. దీపావళి ఆఫర్‌లో శాంసంగ్, గూగుల్ విక్రయించే కొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్లు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)
గూగుల్ పిక్సెల్ 8ను ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా పరిగణించవచ్చు. ఈ ఫోన్ టెన్సార్ జీ3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని రూ.82,999 ధరతో మనదేశంలో లాంచ్ చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2024లో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 42,999కి కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ (Samsung Galaxy S23 5G)
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ కూడా ఒక ప్రీమియం ఫోన్‌. దీనిని ప్రజలు చాలా ఇష్టపడతారు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో మార్కెట్లోకి వస్తుంది. అదే సమయంలో అనేక గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ దీన్ని రూ.95,999 ధరకి మార్కెట్లో లాంచ్ చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను కూడా కేవలం రూ.42,999కే కొనుగోలు చేయవచ్చు.


ఇవి మాత్రమే కాకుండా కొన్ని బడ్జెట్ ఫోన్లపై కూడా మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే



సీఎంఎఫ్ ఫోన్ 1 (CMF Phone 1)
సీఎంఎఫ్ ఫోన్ 1లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 అయినప్పటికీ డిస్కౌంట్ తర్వాత, మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.


మోటొరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)
మోటొరోలా మార్కెట్లోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీమియం మొబైల్‌గా పరిగణించవచ్చు. మీరు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మోటొరోలా ఎడ్జ్ 50 నియోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.29,999. కానీ తగ్గింపు తర్వాత దీన్ని కేవలం రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు.


ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ (Oppo F27 Pro+)
ఒప్పో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కంపెనీ దీన్ని ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐపీ69 రేటింగ్‌తో వస్తుంది. అంటే ఈ ఫోన్ నీరు, దుమ్ముతో కూడా పాడైపోదు. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 32,999 కాగా, దీపావళి సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.27,999కి కొనుగోలు చేయవచ్చు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?