Thailand Open 2022: PV Sindhu storms into semi-finals, defeats Japan's Akane Yamaguchi : రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు థాయ్‌ల్యాండ్‌ ఓపెన్‌ 2022లో సెమీ ఫైనల్‌ చేరుకుంది. థాయ్‌ల్యాండ్‌లో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో కఠిన ప్రత్యర్థి అకానె యమగూచి (జపాన్‌)పై అద్భుత విజయం అందుకుంది. 21-15, 20-22, 21-13 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది.






మొదటి గేమ్‌లో సింధు 21-15తో ఆధిపత్యం చెలాయించింది. కానీ రెండో గేమ్‌లో యమగూచి పుంజుకుంది. 20-22తో సింధును వెనక్కి నెట్టేసింది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తెలుగు తేజం అద్భుతంగా ఆడింది. బలమైన క్రాస్ కోర్టు షాట్లు, స్మాష్‌లతో విరుచుకుపడింది. 21-15 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచును గెలిచేసింది. సెమీ ఫైనల్లో సింధు మరో కఠిన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంది. ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత చెన్‌ యూఫీతో తలపడాల్సి ఉంది.


Also Read: MI vs DC మ్యాచుకు కోహ్లీ! దగ్గరుండి రోహిత్‌ను ప్రోత్సహిస్తాడట!


Also Read: మాంత్రికుడి ప్రాణం చిలకలో! RCB, DC ప్రాణాలు ముంబయి చేతిలో!!


అంతకు ముందు గురువారం దక్షిణ కొరియాకు షట్లర్‌ యూ జిన్‌ సిమ్‌ను సింధు ఓడించింది. కాగా భారత మరో షట్లర్‌ మాలవిక బన్సోడ్‌ 16-21, 21-14, 21-14 తేడాతో ఓటమి చవిచూసింది. డెన్మార్క్‌ అమ్మాయి క్రిస్టోఫెర్సెన్‌ ఆమెపై గెలిచింది.