Nitesh Kumar Clinches India's Second Gold, Wins Badminton Final:  పారాలింపిక్స్‌లో భారత్‌ రెండవ స్వర్ణ పతకం సాధించింది. పారా బ్యాడ్మింటన్ ఫైనల్‌లో టాప్ సీడ్ భారత పారా షట్లర్ నితేష్ కుమార్ బంగారు  పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన అవని లేఖరా తర్వాత ఈ దిగ్గజ పారా షట్లర్ భారత్‌కు రెండో బంగారు పతకాన్ని అందించాడు. దీంతో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో భారత్ పతకాల సంఖ్య ఇప్పుడు 9కి పెరిగింది.

Continues below advertisement


ఇద్దరు ఫైనలిస్టుల  మధ్య జరిగిన సుదీర్ఘమైనమ్యాచ్ లో  బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌తో జరిగిన మొదటి గేమ్‌ను నితేష్ సునాయాస విజయం సాధించగా, అతని   బలమైన డిఫెన్సివ్ ఆట బెథెల్ పొరపాట్లు చేసేలా చేసింది, ఫలితంగా ప్రారంభ గేమ్‌లో భారత పారా షట్లర్ 21-14తో విజయం సాధించింది. తరువాత కూడా 18-21, 23-21తో నితేష్ కుమార్ డానియల్‌ బెతెల్‌  ను ఓడించాడు.


 






గతేడాది చైనాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో రజత పతకం సాధించిన ఎస్‌ఎల్‌3 కేటగిరీ ఆటగాడు నితేశ్.. పారిస్ పారాలింపిక్స్‌లో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల శిక్షణ పొందిన ఈ ఇంజనీర్ ఒక రైలు ప్రమాదంలో    ఎడమ కాలును కోల్పోయాడు.