టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసుకు ఎంపిక చేయకపోతే అన్యాయమేనని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అంటున్నాడు. వన్డే క్రికెట్లో అతనెప్పుడో నిరూపించుకున్నాడని కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదన్నారు. పైగా 'మిస్టర్‌ ఐసీసీ'గా అతడికి పేరుందని వెల్లడించాడు. అతడికి మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు.


'12, 8, 14, 12, 0.. విజయ్‌ హజారేలో శిఖర్‌ ధావన్‌ చివరి స్కోర్లు ఇవి. అతడిని ఎంపిక చేస్తారా? చేస్తారనే అనుకుంటున్నా. ధావన్‌ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. వన్డే క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. పైగా అతడిని మిస్టర్‌ ఐసీసీ అంటారు. 2023 వరకు అతడు దారుఢ్యంగా ఉంటే ఎందుకు ఎంపిక చేయరు?' అని మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా ప్రశ్నించాడు.


'2021లో టీమ్‌ఇండియా ఎక్కువ వన్డే క్రికెట్‌ ఆడలేదు. అలాంటప్పుడు అతడిని ఎందుకు తొలగించాలి? అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాల్సిందని చాలామంది అంటుంటారు. రుతురాజ్‌ పరుగులు చేస్తున్నాడని, అయ్యర్‌ ఓపెనింగ్‌ చేయగలడని, రోహిత్‌-రాహుల్‌ జోడీ సెట్టైందని అతడిని పక్కన పెట్టడం అన్యాయం' అని ఆకాశ్‌ అంటున్నాడు.


'నిజంగానే గబ్బర్‌ బాగా ఆడకపోతే జట్టు నుంచి తప్పించండి. కానీ మరొకరు మెరుగ్గా రాణిస్తున్నారని అతడిని పక్కనపెట్టడం సరికాదు. కొన్ని దేశవాళీ క్రికెట్‌ ప్రదర్శనలను బట్టి నిరూపించుకున్న భారత ఆటగాడిని తప్పించడం అన్యాయం. ఒక సీనియర్‌ ఆటగాడిని పక్కన పెడుతున్నప్పుడు కమ్యూనికేషన్‌ అత్యంత కీలకం. మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం నింపడం అవసరం' అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 


Also Read: Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్‌ రోహిత్‌' మర్చిపోలేని 2021


Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021


Also Read: IPL Media Rights Tender: బీసీసీఐకి డబ్బుల పండగ! రూ.50వేల కోట్లు వస్తాయన్న గంగూలీ.. రంగంలోకి రిలయన్స్‌?


Also Read: Kidambi Srikanth: వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో పతకం ఖాయం.. సెమీస్‌కు చేరిన తెలుగు తేజం!


Also Read: Hockey Men's Asian Champions Trophy: శెభాష్‌ భారత్‌..! పాక్‌ను ఓడించి సెమీస్‌ చేరిన హాకీ ఇండియా


Also Read: India U19 team: కుర్రాళ్లకు రోహిత్‌ పాఠాలు..! జోరు మీదున్న కొత్త కెప్టెన్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి