Virat Kohli And Anushka Sharma in London: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట లండ‌న్ లోని యూనియన్ చాపెల్‌లో జ‌రిగిన కృష్ణ దాస్ కీర్తనకు హాజరైన దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. విరుష్క జంట ఇత‌ర స‌భ్యుల‌తో క‌లిసి హాలులో కూర్చుని కృష్ణ‌దాస్ కీర్త‌న‌లు వింటున్న దృశ్యాలు అందులో క‌నిపించాయి. కృష్ణ దాస్‌ని చాలా మంది యోగా రాక్ స్టార్ అని కూడా పిలుస్తారు. అతను సాంప్రదాయ భారతీయ కీర్తనను ఆధునిక సంగీతంతో మిళితం చేస్తాడు.


విరుష్క జంట లండన్‌లో కీర్తనకు హాజరు కావడం ఇదే మొదటిసారి కాదు. ఈనెల ప్రారంభంలో కూడా, కృష్ణదాస్ మరో సభకు హాజరైన సందర్భంగా ఇద్దరు తోటి భక్తులతో కలిసి 'శ్రీరాం, జై రామ్' అని నినాదాలు చేస్తూ కనిపించారు. తరువాత, అనుష్క కీర్తనలోని ఫోటోలను కూడా పంచుకోవ‌డ‌మే కాకుండా తన పోస్ట్‌లలో కృష్ణ దాస్‌ను ట్యాగ్ చేశారు.


లండన్‌కు షిఫ్టింగ్ వదంతులకు మరింత ఊతం! 
విరాట్, అనుష్క దంప‌తులు తమ పిల్లలు, వామిక, అకాయ్‌లతో కలిసి 'సాధారణ' జీవితాన్ని గడపడానికి శాశ్వతంగా లండన్‌కు మారారని ఇటీవ‌ల ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా విరుష్క జంట తరచుగా లండన్‌లో కనిపించడం వల్ల ఈ ఊహాగానాలకు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్లయింది. ఇటీవల కూడా  విరాట్ కోహ్లీ భారతదేశంలో జరిగిన టి 20 ప్రపంచ కప్ విజయ వేడుకల తర్వాత లండన్‌కు వెళ్లిపోయాడు. 


2023లో విరాట్ కోహ్లీ తన బిజీ షెడ్యూల్ నుండి రెస్ట్ తీసుకున్నాడు. అప్ప‌టి నుండి లండన్‌లో అనుష్కతో ఫ్యామిలీ టైమ్ గడుపుతున్నాడు. ఆ సమయంలో లండన్‌లోని ఒక రెస్టారెంట్ వెలుపల అనుష్క, విరాట్‌ల జంట ఫోటో వైరల్ అయ్యింది. అకాయ్ పుట్టిన తర్వాత లండన్‌లోని ఒక రెస్టారెంట్‌లో విరాట్ వామికతో కలిసి కనిపించాడు. టీ20 వరల్డ్ కప్ నెగ్గాక కోహ్లీ రిలాక్స్ అయ్యాడు. ఇదివరకే అతడి ఖాతాలో అండర్19 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ ఉన్నాయని తెలిసిందే. 


 కోహ్లీ రిటైరైతే ఫ్యామిలీతో అక్కడే ఉంటాడా?


అంతేకాదు, అనుష్క శర్మ కూడా గర్భం దాల్చ‌డంతో ఎక్కువ స‌మ‌యం ప‌బ్లిసిటీకి దూరంగా లండన్‌లోనే ప్ర‌శాంత జీవితం గ‌డిపారు. దీంతో అకాయ్ లండన్‌లో పుట్టాడనే వార్త‌లు నిజ‌మ‌నే నమ్మకం ఏర్పడింది. ఇటీవ‌ల అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ కోహ్లీ అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్ అయిన తర్వాత శాశ్వతంగా లండ‌న్‌కు మ‌కాం మార్చి అక్క‌డే శాశ్వ‌త నివాసం ఏర్ప‌రుచుకుంటార‌ని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. ఈ ఊహాగానాల‌పై ఇటు అనుష్కగానీ విరాట్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
Also Read: Paris Olympics 2024: చరిత్రలో నిలిచిపోయేలా, క్రీడా ప్రపంచం అబ్బురపడేలా


గ‌త ఆరేళ్లుగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంటోన్న అనుష్క శ‌ర్మ తాజాగా మ‌హిళా క్రికెట‌ర్ జుల‌న్ గోస్వామి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చక్దా ఎక్స్‌ప్రెస్ బ‌యోపిక్‌ చిత్రంలో క‌నిపించ‌నున్నారు. ఆమె చివరిగా షారుఖ్ ఖాన్, క‌త్రినా కైఫ్‌లతో కలిసి జీరోలో కనిపించింది. రాబోయే స్పోర్ట్స్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది. అయితే దీని విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.