Indian Cricket Team With PM Modi: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి... విశ్వ విజేతలుగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లు, కుటుంబ సభ్యులతో కలిసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇవాళ ఉదయం బార్బడోస్‌ నుంచి ఢిల్లీకి చేరిన భారత ఆటగాళ్లు... ప్రధానమంత్రి అధికారిక నివాసంలో మోదీని కలిసి కాసేపు ముచ్చటించారు. టీ 20 ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత ఎంత భావోద్వేగానికి గురయ్యామో... ఆటగాళ్లు మోదీకి వివరించారు. పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన ఆటగాళ్లను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతీ ఆటగాడు తమ అనుభవాలను మోదీకి వివరించారు. టీమిండియా సారధి రోహిత్, విరాట్‌ కోహ్లి, రాహుల్‌ ద్రవిడ్‌లతో జోకులు వేస్తూ ప్రధాని మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యాలు అభిమానుల మనసులు దోచుకున్నాయి.