Virat Kohli Century:  శ్రీలంకతో తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో 20 సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సచిన్ ఇంతకుముందు ఈ ఘనత సాధించగా.. ఇప్పటివరకు 19 సెంచరీలతో ఉన్న కోహ్లీ తాజాగా ఆ రికార్డును అందుకున్నాడు. అలాగే సచిన్ మరో రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. 


తాజా శతకంతో వన్డే ఫార్మాట్లో శ్రీలంక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఈ ఫార్మాట్లో భారత లెజెండ్ సచిన్ శ్రీలంకపై 8 సెంచరీలు చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అదే జట్టుపై 9 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు.