ICC Champions Trophy 2025 | ఆడిన ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక రికార్డు నెలకొలపుతున్న కింగ్ కోహ్లీ ఆసీస్ తో చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో గెలుపు ద్వారా సచిన్ యువరాజ్ ల సరసన చేరాడు. ఇంతవరకు ఐసీసీ టోర్నమెంట్లలో నాకౌట్ గేమ్స్ లో ఇండియా కేవలం నాలుగు సార్లు మాత్రమే గెలిచింది. వీటిలో సచిన్ ఒకసారి, యువరాజ్ సింగ్ 3 సార్లు మేన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఇప్పుడీ ఐదో గెలుపుతో కోహ్లీ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకొని వారి పక్కన చేరాడు
సచిన్ (1998 నాకౌట్ ట్రోఫీ )
1998లో టెస్ట్ మ్యాచ్ అన్ని జట్ల మధ్య తొలిసారి నాకౌట్ సిరీస్ జరిపింది ఐసీసీ. దానిలో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా 50 ఓవర్ల లో 307 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 263 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 141 (128 బంతుల్లో ) పరుగులు సాధించడమే కాకుండా 4 వికెట్లు తీయడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు.
యువరాజ్ సింగ్ -2000 ఛాంపియన్స్ ట్రోఫీ
2000 లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా 265 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 245 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో 84 పరుగులు (80 బంతుల్లో ) చేసిన యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు
యువరాజ్ సింగ్ -2007 T20 వరల్డ్ కప్
2007 లో జరిగిన తొలి T20 వరల్డ్ కప్ సెమీ ఫైనక్ లో ఇండియా 20 ఓవర్ల లో 188 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా 173 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యింది. ఈ మ్యాచ్ లో 30 బంతుల్లోనే 70 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
యువరాజ్ సింగ్ -2011 వరల్డ్ కప్
సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ కలను తీర్చిన 2001WC ట్రోఫీ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆస్ట్రేలియా చేసిన 260 (50 ఓవర్ల లో ) పరుగులను ఇండియా 47.4 ఓవర్ల లోనే ఛేదించింది. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడం తో పాటు 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు
విరాట్ కోహ్లీ -2025 ఛాంపియన్స్ ట్రోఫీ
తాజా గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా ఇచ్చిన 264 పరుగుల టార్గెట్ ను ఇండియా 48.1 ఓవర్ల లోనే ఛేదించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 84 (98 బంతుల్లో ) రన్స్ చేసి ఇండియా విజయం లో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని సచిన్, యువరాజ్ సింగ్ ల సరసన నిలిచాడు.