మహా పతివ్రతల్లో ఒకరు అరుంధతి. వశిష్టమహర్షి భార్య. పెళ్లిసమయంలో పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెకు ఆకాశంలో నక్షత్ర రూపంలో ఉన్న అరుంధతిని చూపిస్తారు. ఎందో మహా పతివ్రతలుండగా అరుంధతినే ఎందుకు చూపిస్తారు. నూతన దంపతలకు అరంధతిని చూపించడం వెనుకున్న ఆంతర్యం ఏంటి...


బ్రహ్మచారికోసం వెతికిన బ్రహ్మదేవుడి కుమార్తె
బ్రహ్మ కుమార్తె పేరు సంధ్యాదేవి. తనకు ఉపదేశము చేయగల బ్రహ్మచారి కోసం ముల్లోకాలు వెదకడం ప్రారంభించింది సంధ్యాదేవి.  వశిష్ఠుడే తనకు ఉపదేశం చేసేందుకు తగినవాడని భావించి విని..ఆయన్న ఆశ్రయించింది. బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు ఆమెకు ఉపదేశం చేయడానికి అంగీకరించాడు. ఉపదేశ అనంతరం సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది. ఆ అగ్ని నుంచి ప్రాతః సంధ్య, సాయం సంధ్య లతో పాటు ఒక స్త్రీ రూపం వెలువడ్డాయి. అందమైన ఆ స్త్రీ రూపమే  మహా పతివ్రత అరుంధతి.


Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!


ఇసుకతో అన్నం వండిన అరుంధతి
వశిష్ఠుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని తగిన వధువు కొరకు అన్వేషణ ప్రారంభించాడు. తనను పెళ్లిచేసుకునే స్త్రీకి ఓ పరీక్ష పెట్టాడు వశిష్టుడు. అదేంటంటే...ఇసుకతో అన్నం వండటం. అందుకే ఓ  ఇసుక మూటను పట్టుకుని దాన్ని అన్నంగా వండగలిగినవారు ఎవరంటూ సంచారం చేశారు. ఆ సందర్భంలో అరుంధతి..వశిష్టుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించింది. తనకున్న దైవబలంతో ఇసుకను బియ్యంగా మార్చి వండి వడ్డించింది అరుంధతి. సంతోషించిన వశిష్ఠుడు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే తన చేతి కమండలం అరంధతికిచ్చి తాను తిరిగివచ్చేవరకూ దాన్ని చూస్తూ ఉండమని చెప్పి వెళ్లాడు. 


Also Read: ఆగస్టు 18 or 19 శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి


ఏళ్ల తరబడి చూపు మరల్చని అరుంధతి
ఏళ్ల తరబడి అరుంధతి ఆ కమండలాన్నే చూస్తూ ఉండిపోయింది. అయినా వశిష్ఠుడు తిరిగి రాలేదు. ఎందరో పండితులు,రుషులు ఆమెను చూపు మరల్చమని చెప్పినా చూపు తిప్పలేదామె. చివరకు బ్రహ్మాదిదేవతలు దిగివచ్చి ఆమెను కమండలము నుంచి చూపు మరల్చాలని చెప్పినా వినలేదు. ఇక చేసేది లేక విశిష్టుడిని వెతికితీసుకొచ్చి ఆమెముందు నిలిపారు. ఆయన రాకతో తన చూపును కమండలం నుంచి విశిష్టుడి వైపు మరల్చింది. అప్పుడు బ్రహ్మాదిదేవతల సమక్షంలో అరుంధతిని పెళ్లిచేసుకున్నాడు విశిష్టుడు. అప్పటి నుంచి మనసా, వాచా, కర్మణా వశిష్టుడిని అనుసరించి మహాపతివ్రతగా నిలిచిపోయింది అరుంధతి. 


Also Read:  రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం


నవవధువు కూడా అరుంధతిలా ఉండాలని
అరుంధతి తన సౌభాగ్య, పాతివ్రత్య దీక్షతో నక్షత్ర రూపంలో వెలుగుతూ ఆకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే  మూడుముళ్లు వేసిన తర్వాత వరుడు..వధువుకి అరుంధతి నక్షత్రం చూపిస్తాడుయ. అరుంధతిలా సహనం, శాంతం, ఓర్పు, పాతివ్రత్య లక్షణాలు కలగి ఉండాలని..ఆ బంధం అరంధతి, వశిష్టులులా చిరస్థాయిగా వెలగాలని, నిలవాలని దాని అర్థం.  అరుంధతి వశిష్టుల కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. ఈ పరాశరుడు మత్సకన్యను కోరుకుంటాడు. వీరికి పుట్టిన కుమరుడే వ్యాసమహర్షి...అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.