Telangana News: గోదావరి, కృష్ణా పుష్కరాలపై తెలంగాణ సీఎం ఫోకస్- అధికారులకు కీలక ఆదేశాలు

పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఫిబ్రవరి 10లోపు టూరిజం పాలసీని సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలన్న సీఎం దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలన్నారు.
ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు సీఎం,
సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.
జాతరతోపాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ అభివృద్ధి చేయాలని చెప్పారు.
ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాల్లో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలన్నారు.
సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులకుసూచించారు ముఖ్యమంత్రి
వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమీక్, జరిగింది.