Mahakumbha 2025: మౌని అమావాస్య సమయం- మహాకుంభమేళాలో కోట్లమంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న ఈ మహాకుంభానికి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
జనవరి 29వ తేదీ మౌని అమావాస్య పవిత్రమైన సందర్భం భారీగా భక్తులు వచ్చి పుణ్యస్నానం చేశారు.

భారీగా తరలి వచ్చిన భక్తులు స్నానాలు చేసేందుకు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 30మంది చనిపోయారు.
ఇవాళ జరిగే అమృతస్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మౌని అమావాస్య శుభ సందర్భంగా 144 సంవత్సరాల తర్వాత ఇలాంటి అమృత ఘడియలు వస్తాయని అంటారు.
కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడానికి నాలుగు శుభ ముహూర్తాలు ఉంటాయి. అందులో మూడు పూర్తయ్యాయి.
మొదటి అమృత స్నాన్ జనవరి 14న మకర సంక్రాంతి రోజున జరిగింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి అమృతస్నానం చేశారు.
రెండవ అమృత స్నాన్ జనవరి 29 బుధవారం మౌని అమావాస్య రోజు జరిగింది. కోట్ల మంది వచ్చి స్నానాలు ఆచరించారు.
హిందూ మతంలో మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది.
మాఘమాసంలోని కృష్ణ పక్ష అమావాస్యను మౌని అమావాస్య లేదా మాఘ అమావాస్యగా జరుపుకుంటారు.
మౌని అమావాస్య రోజున మౌనవ్రతం పాటిస్తూ స్నానం చేస్తారు.
మౌని అమావాస్య రోజున గంగాస్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాలో రెండో అమృత స్నాన్ జరుగుతుంది.
మౌని అమావాస్య రోజున కుంభస్నానం చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారని నమ్మకం.
మౌని అమావాస్య రోజున గంగాస్నానంతోపాటు పూర్వీకులకు నైవేద్యాలు, దానాలు చేస్తారు.
మౌని అమావాస్య రోజున గంగాస్నానం చేస్తే పాపాలు నశించి, పూర్వీకులకు శాంతి చేకూరుతుందని నమ్మకం.