Duleep Trophy: అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు ప్రారంభం-ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్లో క్రికెటర్ల సందడి
దేశీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉదయం 9 గంటలకు ఆర్డిటి ప్రధాన క్రీడా మైదానంలో ఇండియా సి, ఇండియా డి టీం మధ్య మ్యాచ్ ప్రారంభమైంది.
టీంసీ కి రుతురాజు గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నాడు. టీం డి కి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది.
మ్యాచ్ల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం సహకారంతో బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అనంతపురం జిల్లా క్రికెటర్ అసోసియేషన్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
అనంతపురంలో ఐదు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. క్రికెట్ చూసేందుకు వచ్చే అభిమానుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ను ఏర్పాటు చేశారు. క్యాంపస్లో స్నాక్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ను స్పోర్ట్స్ 18, జియో ఛానల్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.
స్టేడియంలోకి లాప్టాప్స్, కెమెరాలు, అగ్గి పెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాటరీలు, బ్యాగులు, బ్యానర్లు, సిగరెట్టు, లైటర్లు, హెల్మెట్లు, నీళ్ల బాటిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, షార్ప్ మెటల్స్కు అనుమతి లేదు.
టీం సీ జట్టు : రుతురాజు గైక్వార్డ్ ( కెప్టెన్), సాయి సుదర్శన్, రజిటార్, అభిషేక్ పోవే ల్ (వికెట్ కీపర్), బాబా ఇంద్రజిత్, హృతిక్ శోకీన్, మనవ్ సూతర్, గౌరవ్ యాదవ్,విజయ్ కుమార్ వైశక్, అన్శుల్ కంబోజ్, మయాంక్ మార్కండ్, హిమాన్షు చౌహాన్,ఆర్యన్ జుయల్, సందీప్ వారియర్.
టీం డీ జట్టు : శ్రేయస్ అయ్యర్ ( కెప్టెన్), దేవ్దత్, అథర్వ తైడ్, యశ్ దుబే, రికీభూ, శ్రీకర్ భారత్ (వికెట్ కీపర్), అక్షర పటేల్, సరన్ష్ జైన్, హర్షదీప్ సింగ్, ఆదిత్య తకర్, హర్షిత్ రానా, తుషార్ దేశ్ పాండే, సంజు సాంసంన్, ఆకాశ్ సెంగుప్త,సౌరభ్ కుమార్.
టీం డీలో ఈరోజు ఆడాల్సిన వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కిషన్ కిషన్ గాయం కారణంగా ఆడలేకపోయాడు ఇషాన్ కిషన్ ప్లేస్లో టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ను తీసుకున్నారు