Weekly Top Headlines: ఏప్రిల్ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ మే 3న శంకుస్థాపన చేశారు. ఇక్కడ నుంచి మూడేళ్లలో తొలి విమానం నడిచేలా నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్లాన్ చేస్తోంది. ఒకేసారి ఇరవైకి పైగా విమానాలు దిగేలా ఈ ఎయిర్పోర్టును తీర్చిదిద్దనున్నారు. మూడు దశల్లో దీన్ని పూర్తి చేయనుంది. మొదటి దశలో 60 లక్షళ మంది, రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించేలా నిర్మించనున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఏప్రిల్ 30 మధ్యాహ్నం 1.30కు ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం సచివాలయ శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తనర ఛాంబర్ లోకి వెళ్లి కీలకమైన 6 ఫైల్స్ పైన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కేసీఆర్ కు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. తన ఛాంబర్లో ఆసీనులైన సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్కు మంత్రి హరీశ్రావు పాదాభివందనం చేశారు. మరోవైపు మంత్రులు కూడా సుముహూర్త సమయంలో తమ ఛాంబర్లలోకి ప్రవేశించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు నిర్ణయించిన సమయానికి తమ సీట్లలో ఆసీనులయ్యారు.
ఈ వారంలో వైసీపీ ఎమ్మెల్యే మాజ మంత్రి బాలినేని శ్రీనివాస్ వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారింది. ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్న బాలినేని ఈ వారంలో పార్టీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత స్వయంగా సీఎం ఆయన్ని పిలిచి మాట్లాడారు. అయినా ఆయన తగ్గలేదు. ఏకంగా శుక్రవారం ఒంగోలులో బల ప్రదర్శనకు దిగారు. ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. తర్వాత ఆయన ఏం చేయబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది.
మే 3న రుషికొండ హిల్ నెంబర్ 4లో అదానీ - వైజాగ్ డేటా సెంటర్కు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కాలేదు. ఆయన ఇద్దరు కుమారులు, అదానీ గ్రూప్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జీత్, కరణ్ అదానీలు హాజరయ్యారు. విశాఖపట్నం డాటా టెక్నాలజీకి సెంటర్ గా మారుతుందని ఈ సందర్భంగా కరణ్ అదానీ విశ్వాసం వ్యక్తం చేశారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీార్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ నాలుగేండ్లలో ఏం చేశాడో చెప్పే దమ్మందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ ఎవరంటే చెప్పుకోవడానికి తనకు సిగ్గు అయింతుదని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా మళ్ళీ వినోద్ కుమార్ ను గెలిపించి.. బండి సంజయ్ ను ఇంటికి పంపాలని సూచించారు. కేటీఆర్ ప్రకటనతో ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరు ఖరారైనట్లయింది. ప్రస్తుతం వినోద్ కుమార్ తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకే కేబినెట్ హోదా ఉంది.
ఢిల్లీలోని వసంత్ విహార్లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్(BRS ) కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రారంభించారు. అంతకంటే ముందు అక్కడ జరిగిన పూజ,యాగంలో కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కరెక్ట్గా ఒంటిగంట ఐదు నిమిషాలకు రిబన్ కట్ చేసి భవనంలోకి ప్రవేశించారు.
పంచ బ్యాంక్ అధ్యక్ష పీఠం అజయ్ బంగాకు దరి చేరింది. ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా అజయ్ బంగా పేరును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. 2023 జూన్ 2 నుంచి ఐదేళ్ల కాలానికి అధ్యక్షుడిగా బంగాను ఎంపిక చేశారు.
వాడియా గ్రూప్నకు (Wadia Group) చెందిన గోఫస్ట్ ఎయిర్లైన్స్ అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నెల 3, 4 తేదీల్లో తమ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ ఎయిర్లైన్స్, దివాలా పరిష్కార ప్రక్రియ కోసం (bankruptcy) జాతీయ అప్పిలేట్ ట్రైబ్యునల్ (NCLT) దిల్లీ బెంచ్కి స్వచ్ఛందంగా దరఖాస్తు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఎటువంటి నోటీసు లేకుండా విమానాలను రద్దు చేసి, ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసింనందుకు ఈ కంపెనీ DGCA షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.
అనుకున్నదే జరిగింది! కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం తీవ్రమైనదేనని తేలింది! దాంతో ఐపీఎల్ 2023 మిగిలి సీజన్, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అతడు దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచులో అతడు గాయపడిన సంగతి తెలిసిందే. అతడి గాయాన్ని పరీక్షించిన బీసీసీఐ వైద్యబృందం శస్త్రచికిత్స చేయాల్సిందిగా సూచించింది.
ద కేరళ స్టోరీ The Kerala Story సినిమా. అదాశర్మ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. లవ్ జిహాద్ (Love Jihadi) కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ విడుదలపై నిషేధం విదించారు. కొన్ని థియేటర్లు షోస్ క్యాన్సిల్ చేశాయి. కేరళ ప్రభుత్వమైతే డైరెక్టర్, ప్రొడ్యూసర్పై తీవ్రంగా మండి పడుతోంది. మత విద్వేషాలు పెంచొద్దని హెచ్చరించింది. తమిళనాడు హైకోర్టు వరకూ వెళ్లింది ఈ వివాదం. ఈ సినిమాను బ్యాన్ చేయాలని కొందరు పిటిషన్ వేశారు. కానీ కోర్టు మాత్రం ఆ పిటిషన్ని తిరస్కరించింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టుకి చేరుకున్నా...అక్కడా చుక్కెదురైంది. ఇలాంటి విషయాల్లో వేలు పెట్టం అని కోర్టు స్పష్టం చేసింది. అటు ముస్లిం సంఘాలు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఓ హామీ ఇప్పుడక్కడ పెద్ద దుమారమే రేపింది. తాము అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ని బ్యాన్ చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. దీనిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ మేనిఫెస్టోని తగలబెడుతూ ఆందోళనలు చేపడుతున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ రాజీనామా మహారాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచింది. సుప్రియా సూలే ఆ పదవీ బాధ్యతలు తీసుకుంటారని భావించినా అది జరగలేదు. అయితే పార్టీ కోర్ కమిటీ మాత్రం శరద్ పవార్ రాజీనామాను ఖండించింది. ఆయన రాజీనామాను తిరస్కరించింది. అంతే కాదు. చీఫ్ పదవిలోనే కొనసాగాలని పవార్కు రిక్వెస్ట్ కూడా పెట్టుకుంది. కమిటీ సభ్యులో తదుపరి అధినేత ఎవరో నిర్ణయిస్తారని పవార్ చెబుతూ వచ్చారు. అయితే..కమిటీ మాత్రం ఆయన నిర్ణయాన్ని అంగీకరించడం లేదు.